ఆంగ్లో-సిక్కుల యుద్ధ స్మారకం, అమరవీరుల గౌరవార్ధం 1976 లో నిర్మించబడింది. ఫెరోజెషాహ్, ముడ్కి వద్ద బ్రిటీషు సమూహాలకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో తమ జీవితాలు కోల్పోయిన పంజాబీల పరాక్రమానికి గుర్తుగా పెద్ద చిత్రాలు ఉన్నాయి. రాజస్తాన్ కాలువ ఒడ్డున ఉన్న ఈ మూడంతస్తుల భవనం యుద్ధరంగంలో ధైర్యవంతులు, ఆయుధాలు, చరిత్రలో నిలిచిపోయే వారి పేర్లుగల వారి చిత్తరువులను ప్రదర్శిస్తుంది. ఫెరోజేశాహ్ వద్ద ఉన్న ఈ స్మారకం, మొగ రహదారి వద్ద ఫెరోజెపూర్ నుండి షుమారు 16 కిలోమీటర్ల వద్ద ఉంది.