ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న జాతీయ అమరవీరుల స్మారకం, 1968 లో సట్లేజ్ నది ఒడ్డుపై నిర్మించబడింది. విప్లవకారులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు లు మరణశిక్ష నిర్ణయించిన తేదీకన్నా ఒకరోజు ముందే ఉరితీసారు. లాహోర్ పౌరుల ఒత్తిడిని తట్టుకోనడానికి బ్రిటీషువారు ఈ విప్లవ వీరుల మృతదేహాలను దొంగతనంగా తీసుకువెళ్ళారు. బి.కే.దత్ కూడా అతని చివరి కోరిక ప్రకారం ఇక్కడే దహనం చేయబడ్డారు.
1971 లో ఇండియా-పాకిస్తాన్ యుద్ధ సమయంలో, స్మారకాల వద్ద పాకిస్తాన్ సైన్యం జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించారు. అయితే, ఇవి 1973 లో పంజాబ్ మాజీ ప్రధాన మంత్రి జ్ఞాని జైలు సింగ్ ప్రయత్నాల ఫలితంగా పునర్నిర్మించబడ్డాయి. ప్రతి ఏటా మార్చ్ 23 న స్వాతంత్ర్య సమరయోధుల గౌరవార్ధం నిర్వహించే శాహీది మేళా లో వేలమంది ప్రజలు ఈ జాతీయ అమరవీరుల స్మారకలను సందర్శిస్తారు.