దొడ్డ బసప్ప (డంబాల గుడి)డంబాలలోని దేవాలయాలలో ఈ దేవాలయం అనేక కోణాలు కలిగి ఆకర్షణీయ ఆకారంలో ఉంటుంది. ఈ గుడిలో శివలింగాన్ని ఆ ప్రాంత ప్రధాన దేవుడుగా కొలుస్తారు. గడగ్ వచ్చే యాత్రికులకు చూచి ఆనందించేందుకు తప్పక సూచించదగినది. చరిత్రకారుల మేరకు ఈ దేవాలయాన్ని కళ్యాణి చాళుక్య వంశ పాలకులు నిర్మించారు.
దేవాలయ అంతర్భాగాలు సాధారణ దేవాలయ కట్టడం వలెనే మంటపం, మొదలైనవి కలిగి ఉంటాయి. అయిదు తలల బ్రహ్మ, ఆ దేముడి వాహనం అయిన హంస, వెలుగొందే సూర్యుడు మంటపంలో ఉంటారు. దేవాలయ ప్రవేశంలో కల మెట్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. దేవాలయ స్తంభాలు, గోడలు వివిధ పెయింటింగ్ లు లేదా అనేక దేవుళ్ళు, దేవతల బొమ్మలతో చెక్కబడి ఉంటాయి. మాత తారా దేవి ని చూపిస్తూ ఒక బౌద్ధ దేవాలయం కూడా ఈ దేవాలయ సమీపంలో ఉంటుంది.