హార్టి ప్రదేశంలో కూడా అనేక పురాతన మరియు ఆధునిక దేవాలయాలున్నాయి. హార్టి గడగ్ జిల్లాలో ఒక చిన్న పట్టణం. ఈ చిన్న పట్టణంలో పార్వతీ పరమేశ్వరుల దేవాలయం ఉంది. దీనినే శ్రీ ఉమా మహేశ్వరి దేవాలయం అని కూడా అంటారు. దీనిని చాళుక్యుల పాలనలో నిర్మించారు. హార్టి లో శ్రీ బసవేశ్వర దేవాలయం కూడా ప్రధానంగా పేరుపొందింది.
ప్రతి శ్రావణ మాసంలోను చివరి సోమవారం నాడు ఒక వార్షిక జాతర ఈ దేవాలయంలో జరుగుతుంది. పర్యాటకులు ఆ సమయంలో జరిగే పెద్ద ఊరేగింపును ఎంతో ఆనందిస్తారు. దీనినే స్ధానికులు ప్రతి ఏటా జరిగే జాతరగా అభివర్ణిస్తారు. ఈ జాతరలో ధ్యానమ్మ విగ్రహాన్ని ఊరేగిస్తారు.
ఈ పట్టణంలోనే ఒక చిన్న మసీదు కూడా ఉంది. సంవత్సరంలో చివరగా వచ్చే మొహరం సందర్భంగా ముస్లిం మతస్థులు ఈ వేడుకను మసీదులో ఘనంగా జరుపుకుంటారు. ఈ చిన్న పట్టణంలో హిందువులు, ముస్లింలు ఎంతో కలసి మెలసి జీవిస్తూ అన్ని పండుగలలోను ఒకరికొకరు సహకరించుకుంటూ పరమత సహనాన్ని ప్రదర్శిస్తారు.