గడగ్ జిల్లాలో లక్కుండి అనేది ఒక చిన్న పట్టణం. ఇది కుకునూర్ నుండి సుమారు 50 కి.మీ. ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో అనేక శిధిల దేవాలయాలు ఉన్నాయి. ఇవి చాళుక్యుల పాలనలో నిర్మించబడ్డాయి. వీటిలో కొన్ని దేవాలయాలను అంటే మల్లిఖార్జున దేవాలయం, సోమేశ్వర దేవాలయం, నీలకంఠేశ్వర దేవాలయం, లక్ష్మీ నారాయణ దేవాలయం వంటివి నేటికి సంరక్షించబడుతున్నాయి. లక్కుండి దేవాలయాలన్నింటిలోకి కాశీ విశ్వనాధ దేవాలయం ప్రసిద్ధి. దీనిని దేవాలయాలలో స్వర్గంగా భావిస్తారు. ఈ దేవాలయంలో రెండు పుణ్య క్షేత్రాలు ఒకదానికోకటి ఎదురుగా ఉంటాయి. అవి సూర్యుడు మరియు శివ భగవానుడి విగ్రహాలు.
లక్కుండిలోని దేవాలయాలు హొయసల మరియు చాళుక్యుల కాలంనాటి శిల్పకళా చాతుర్యాలకు నిదర్శనాలు. ఈ గ్రామం 101 మెట్లుగల గోడలు మరియు దేవాలయ గోడలపై గల చారిత్రాత్మక శాసనాలకు ప్రసిద్ధి. లక్కుండి గడగ్ పట్టణానికి ఆగ్నేయంగా 11 కి.మీ. ల దూరంలో ఉంటుంది. ఏ మాత్రం ట్రాఫిక్ ఉండదు కనుక గడగ్ నుండి ఈ పట్టణానికి ఎంతో త్వరగా చేరవచ్చు. డంబాల్ లేదా గడగ్ లనుండి పర్యాటకులు ఆటో రిక్షాలను లేదా టాక్సీలలో లక్కుండి చేరుకోవచ్చు.