గడగ్ లోని త్రికూటేశ్వర దేవాలయం వద్ద సరస్వతి దేవాలయం కలదు. ఈ దేవాలయం చాళుక్యుల నాటి శిల్ప వైభవం కలిగి ఉంది. అసాంఘిక శక్తుల కారణంగా సరస్వతీ దేవి తన అసలు రూపాన్ని ఇక్కడ కోల్పోయింది. కనుక మరొక విగ్రహాన్ని సరికొత్తగా ప్రతిష్టించారు. ఇక్కడే ఆది శంకరాచార్య విగ్రహం కూడా చూడవచ్చు. సరస్వతి దేవాలయం కాక, ఇంకా ఇతర దేవాలయాలు కూడా ఇక్కడ కలవు. సరస్వతి దేవాలయం శిల్పశైలి ప్రాధాన్యతకుగాను ప్రసిద్ధి చెందింది.