గడగ్ జిల్లాలో కుర్తాకోటి ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఉగ్ర నరసింహ, విరూపక్షలింగ మరియు దత్తాత్రేయ దేవాలయాలు హిందువులకు ఎంతో పవిత్రమైనవి. వీటితో పాటు పర్యాటకులు శ్రీరాముని దేవాలయం, అల్లం ప్రభు మఠం కూడా చూడవచ్చు. రామ దేవాలయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలుంటాయి. వీటిని మహర్షి శ్రీ బ్రహ్మ చైతన్య మహరాజ్ ప్రతిష్టించారు. మతపర ఆసక్తికల పర్యాటకులు ఈ ప్రదేశాన్ని తప్పక దర్శించాలి.