ఇండియా విభజన తరువాత, గాంధీజీ వేడుకోలు మేరకు, పాకిస్తాన్ సింధులకు పునరావాసం కల్పించటానికి మహారావు శ్రీ విజయ్ రాయ్ జీ ఖెన్ ఘర్ జీ జడేజా ఉదారంగా 15,000 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. భాయి ప్రతాప్ డయల్ దాస్, గాంధీజీ నేతృత్వంలో పాకిస్తాన్ శరణార్థులకు పునరావాసం కల్పించటానికి ముందడుగు వేశారు. వారు ఎక్కడ నుండి వొచ్చారొ, వారి యొక్క మాతృ భూమిని మరపించేట్లుగా ఈ ప్రదేశాన్ని తీర్చిదిద్దారు. 'ది సింధు రిసెటిల్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్' రూపు దిద్దుకొంది మరియు 'గాంధీధాం' పట్టణం కనుగొనబడింది.
కాండ్ల, భారతదేశం మరియు ఆసియాలో స్థాపించబడిన మొదటి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) మరియు స్వేచ్ఛా వాణిజ్యం మండలం సంబంధిత కార్యకలాపాలవల్ల 'గాంధీధాం'తో పాటు 'కాండ్ల' కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. 'కాండ్ల సముద్రపు ఓడ రేవు' ఒక పర్యాటక ఆకర్షణగా ఉన్నది. గాంధీధాం లో ఉన్న భర్దేశ్వర్ గుడిని శ్రీ చంద్ర ప్రభుజీకి అంకితం చేశారు.
ఇది జైనుల యొక్క ముఖ్యమైన ప్రార్థనా స్థలం. గాంధీధాంలో ఇంకా 'అక్షరధాం ' మరియు పుర్నేశ్వర్ ఆలయం కూడా ఉన్నాయి. ఇక్కడ వేసవికాలంలో ఎక్కువ వేడిగాను మరియు శీతాకాలంలో విపరీతమైన చలిగాలులతో చలిగాను ఉంటుంది.