భేతానాయి చత్రాపూర్ నుంచి 56 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ ప్రాంతం ఇక్కడ విశేష సంఖ్యలో వుండే నల్ల దుప్పుల సంతతికి ప్రసిద్ది. ఈ దుప్పులు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. భేతానాయి ప్రధానంగా సారవంతమైన నేలలు కలిగి వుండడం వల్ల ఇక్కడి గ్రామస్తులు రకరకాల పంటలు పండిస్తారు. బ్లాక్ బక్ గా పిలువబడే ఈ దుప్ప్లులు కొండల మీద నుంచి క్రిందికి దిగి ఆహారం కోసం అడవులలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ అన్వేషిస్తూ వుంటాయి. ఇక్కడ పంటలు పండించే పొలాల వెంట వీటిని పెద్ద సంఖ్యలో చూడవచ్చు.
భేతానాయి పకిడి కొండల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వుంది. దట్టమైన పచ్చని అడవులుండే పకిడి కొండల్లో మన జాతీయ పక్షి నెమలి మందలుగా కనపడుతుంది. వర్షాకాలంలో ఈ పక్షులు కొండల నుంచి క్రిందికి వచ్చి దగ్గరలోని గ్రామాల్లో తిరుగుతాయి. భేతానాయి, పకిడి కొండలు కలిసి జంతువులను, పక్షులను చూసి ఆనందించే ప్రత్యెక పర్యాటక ఆకర్షణగా నిలుస్తాయి.