బెర్హంపూర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో వున్న గిరిసోల ఆంద్ర ప్రదేశ్ నుంచి ఒడిశా కు వెళ్ళే ముఖద్వారంగా పనిచేస్తుంది. నగర గందరగోళానికి దూరంగా వుండే ఈ ప్రాంతం అలసిన యాత్రికుడికి విశ్రాంతిని ఇచ్చే వాతావరణం కలిగి వుంటుంది. దారి వెంట నిర్మించిన యాత్రికుల భవనాలు అలసిన యాత్రికులకు సేద తీరే అవకాశం కల్పిస్తాయి. గిరిసోల పతి సోనేపూర్ బీచ్ కు, భైరాబీ దేవాలయానికి దగ్గరగా వుంటుంది.
జీవ నది బాహుదా వెంట వుండే పతి సొనెపూర్ బీచ్ సముద్రాన్ని, సోనేపూర్ భూభాగాన్ని విభజిస్తూ వుంటుంది. గిరిసోల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వున్న భైరాబీలో వున్న భైరాబీ దేవతకు స్థానిక జాలరులు వేటకు వెళ్ళే ముందు పూజలు చేస్తారు. శక్తి పీఠంగా భావించే ఈ దేవాలయం ఇప్పుడు తీర్థ యాత్రా స్థలం గా మారిపోయింది. పవిత్రమైన దేవాలయం, ప్రశాంతమైన తీరంతో హడావిడికి దూరంగా వుండే గిరిసోల తప్పక చూడాల్సిన ప్రాంతాల్లో ఒకటిగా మారింది.