జౌగడ బెర్హంపూర్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ ప్రదేశం మౌర్యుల కాలానికి చెందిన పురాతన కోటకు చెందిన అవశేషాలకు ప్రసిద్ది చెందింది. మౌర్యుల కాలానికి చెందిన చాలా రాతి శాసనాలు ఇక్కడ వున్నాయి. రుషికుల్యా నదీ తీరాన వున్న జౌగడలో రుషికుల్యా లోయ నాగరికత ఆనవాళ్లకు సాక్ష్యాలు చాలానే వున్నాయి.
ఈ కోట దీర్ఘ చతురస్రాకారంలో వుండేదని ఇక్కడి శిధిలాలు చూస్తె తెలుస్తుంది. మట్టి తో నిర్మించిన ఈ కోట గోడలు, బురుజుల శిధిలాలు ఇప్పటికీ చూడవచ్చు. ఇక్కడి చాలా శాసనాలు, రాతి చెక్కుళ్ళు భారతీయ పురావస్తు శాఖ వారి దృష్టిని ఆకర్షించాయి. కాళేశ్వరం, రామేశ్వరం అనే పేరు గల గుడి ఈ ప్రదేశానికి దగ్గరలోనే వు౦ది. ఈ గుడి లో శివుడు, విష్ణువు కలిసి ఉండడంతో ఇది అరుదైన గుడిగా ప్రసిద్ది చెందింది.