నిర్మల్ ఝర్ గంజాం నుంచి 37 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ ప్రదేశం విష్ణువు, జగన్నాథుడు, విమలా దేవి, రాధాకృష్ణ, శివుడు, వినాయకుడు, సూర్యుడు లాంటి దేవతల గుళ్ళు వున్న సముదాయానికి ప్రసిద్ది చెందింది. బడాఘాటి పర్వతం నుంచి నిరంతరం జాలువారే నీరు కొన్ని చోట్ల పడి స్వచ్చమైన నీటి కొలనుగా ఏర్పడింది – దాంతో దీనికి నిర్మల్ ఝర్ అనే పేరు వచ్చింది – అంటే ‘స్వచ్చమైన నీరు’ అని అర్ధం. నిర్మల్ ఝర్ లో అధిష్టాన దేవత విమలా దేవి.
విష్ణు దేవాలయం లో గోడల మీద వుండే అత్యుత్తమ స్థాయి పనితనం మిమ్మల్ని అబ్బుర పరుస్తుంది – ఇతర దేవాలయాల్లో మహాభారత కథలకు చెందిన ఘట్టాలు శిల్పాలుగా చెక్కి వున్నాయి. ఇక్కడి ప్రశాంతమైన చల్లని నీటి కొలనులో స్నానం చేయడానికి వీలుగా యాత్రికులు ఇక్కడికి వేసవిలో వస్తారు. సంక్లేశ్వర్, ఝాదేశ్వార్ అని పిలువబడే దేవాలయాలతో పాటు, ఖల్లికోట రాజుగారి అంతఃపురం కూడా ఇక్కడికి దగ్గరలోనే వున్నాయి.