ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో కల అయిజారా గ్రామం ఒక చారిత్రక ప్రదేశం. ఇది కాళీ నది ఒడ్డున కలదు. తాలూకా ప్రదేశం అయిన ఖార్ఖోడ కు 7.5 కి.మీ.ల దూరం. ఈ గ్రామం పేరు అయిజాపాల్ అనే ఒక యోగి ఆ గ్రామంలో ఒక గుడి కట్టించి నందున ఆయన పేరు మీదుగా ఏర్పడింది.
ఈ గ్రామం అక్కడ నుండి జన్మించిన ప్రసిద్ధ తబలా కారుల కారణంగా ప్రసిద్ధి అయ్యింది. వీరు ఘరానా అనే శైలి వాయిద్యం వాయిస్తారు. కనుక ఈ గ్రామాన్ని అయిజారా ఘరానా అని కూడా అంటారు.
ఈ తబలా వాయిద్యాన్ని మీరూ ఖాన్ మరియు కల్లో ఖాన్ అనే ఇరువురు సోదరులు ప్రచారం చేసారు. వీరు ఢిల్లీ ఘరానా గురువు ఉస్తాద్ సితాబ్ ఖాన్ శిష్యులు. చివరకు వీరు అయిజర ఘరానా కనిపెట్టి దానిని ప్రసిద్ధి గావించారు.