దస్నా ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో ఒక మండలం. హపూర్ కు 24 కి.మీ.లు ఘజియాబాద్ కు 10 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఇతిహాసాల మేరకు మహమద్ ఘజ్ఞావి అనే రాజపుత్ర రాజు లెప్రసీ తో బాధ పడుతూ హరిద్వార్ దర్శించి అక్కడి గంగ లో మునిగి ఆ వ్యాధిని పోగొట్టు కున్నాడని తిరిగి వచ్చేటపుడు, ఈ ప్రాంత అందాలకు ముగ్ధుడై ఇక్కడ ఒక కోట నిర్మించుకుని స్థిరపడ్డాడని చెపుతారు. ఈ కోట నిర్మాణంలో ఒక కార్మికుడు పాము కరిచి చనిపోగా, పాము కాటు కు అక్కడి భాషలో కల దస్నా పదం ఈ ప్రాంతానికి పెట్టారు. తర్వాతి కాలంలో ఈ గ్రామం పై అహ్మద్ షాహ అబదాలి దండెత్తి, కోటను నాశనం చేసాడు.