గంగా నది యొక్క ముఖ్య ఉపనది అయిన భాగీరథి నది, గోముఖ్ వద్ద ఉద్భవించింది. ఇది హిందువులు పవిత్రంగా భావించే హిమాలయ నది. ఈ నదికి పురాతన రాజు భగీరథుని నుండి ఆ పేరు వచ్చింది. పురాణాల ప్రకారం, ఈ రాజు కపిల మహర్షి శాపం నుండి తన 60,000 పినతండ్రులను విడుదల చేసేందుకు స్వర్గం నుండి గంగా నదిని తీసుకువచ్చాడు. నది యొక్క మూలం సముద్ర మట్టానికి 3892 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ నదికి ఎన్నో ఉపనదులు ఉన్నాయి.