నందనవనం మరియు తపోవనం, గంగోత్రి హిమానీనదానికి ఎదురుగా గంగోత్రి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నందనవనం, శివలింగం, భాగీరథి, కేదర్ డోమ్, తలయ సాగర్ మరియు సుదర్శన వంటి శిఖరాల అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది. ఈ ప్రదేశం సతోపంత్, ఖర్చాకుండ్, కాళింది ఖాల్, మేరు మరియు కేదర్ డోమ్ వంటి శిఖరాల ట్రెక్కింగ్ కు ఆధార స్థావరంగా పనిచేస్తుంది. ప్రయాణీకులు భాగీరథి నది వారగా ట్రెక్ చేస్తూ గోముఖ్ ను చూడవచ్చు. ఇది బండరాళ్ళ మధ్య దూకడం, హిమానీనదాల యాత్ర మరియు రాతి అధిరోహణ వంటి సాహసచర్యలతో కూడిన అత్యంత ప్రసిద్ధ పర్వతారోహణ.
ట్రెక్కింగ్ మార్గం చిర్బాసా వద్ద పైన్ చెట్లు మరియు భోజ్ బాసా వద్ద కొండ రావి పొదలను దాటుకుని వెళుతుంది. ట్రెక్ మార్గం భోజ్ బాసా నుండి లంక మరియు గోముఖ్ కు దారితీస్తుంది. ప్రయాణీకులు నందనవనం వెళ్ళే మార్గంలో గంగోత్రి హిమానీనదం మరియు చత్తురంగిని హిమానీనదం గుండా వెళతారు. నందనవనం నుండి ట్రెక్కింగ్ మార్గం రాతి భూభాగం గుండా వెళ్లి చివరికి తపోవనం యొక్క పచ్చని పచ్చికబయళ్ళకు దారితీస్తుంది.