మా తారా తరిణి హిల్ మందిరం దేశం మొత్తంలో మా తారా పురాతన ఆలయాలలో ఒకటిగా భావించబడింది. ఇది గోపాల్పూర్ కోస్తా పట్టణం నుండి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోని రిశికుల్య నది ఒడ్డుపై కుమారి హిల్స్ పై ఉంది. ఇది సమీప రైల్వే స్టేషన్ బెర్హంపూర్ నుండి షుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. తల్లి పవిత్రమైన ఆశీస్సులు అందుకోవడానికి వేలాదిమంది భక్తులు ప్రతిరోజూ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.
ఈ ఆలయంలో మా తారా, మా తరిణి అని ఇద్దరు దేవతలు ఉన్నారు. వీరిని స్థానికులు ఆదిశక్తి అవతారంగా నమ్ముతారు. ఈ ఆలయం దేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా కూడా భావిస్తారు. ఈ ఆలయం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి నూట డెభ్భై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప నగరాల నుండి టాక్సీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ దేవతలు బంగారు, వెండి వస్తువులతో అలంకరించబడి ఉంటాయి.