ఒరిస్సా, గంజం జిల్లా మొత్తంలో చాలా ప్రసిద్ది చెందిన గ్రామం పంచమ, ఈ ప్రదేశంలో పవిత్రమైన సిద్ధ వినాయక ఆలయం కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని వినాయకుడు అత్యంత ప్రముఖ౦గా పూజించబడే కేంద్రాలలో ఒకటిగా భక్తులు భావిస్తారు.
ఇది పంచాదేవత లను కూడా పూజించే రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ ఆరాధ్య ప్రదేశాలలో ఒకటి. ఇక్కడి దేవత చాలా శక్తులు కలిగినదని భావిస్తారు. ప్రతి ఏటా గణేష్ చతుర్థి రోజు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద వేడుక నిర్వహిస్తారు.
ఆ రోజున దేవత ఆశీర్వాదాలు తీసుకోవడానికి రాష్ట్రము మొత్తం నుండి వేలాదిమంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. సందర్శకులు పంచమ నుండి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెర్హంపూర్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి చేరుకోవచ్చు.