గుణ లో ఉన్న మరొక ప్రధాన ఆకర్షణ ఈ ఆలయం. ఈ జైన్ టెంపుల్ యొక్క అసలు పేరు శ్రీ శాంతినాథ్ దిగంబర్ జైన్ అతిశయ క్షేత్ర. 1236 లో శ్రీ పద షా గురవు చే ఇది నిర్మించబడింది. ఎర్ర రాతి తో చెయ్యబడిన జైన్ తీర్థంకరుల యొక్క అనేక విగ్రహాలు ఈ మందిరం లో ఉన్నాయి. అంతే కాకుండా, జైన్ టెంపుల్ లో ఉన్న జటిలమైన విగ్రహాలు అలాగే ఈ బయట మరియు లోపల ఆలయ గోడలపై ఉన్న చెక్కడాలు ఆకట్టుకుంటాయి.
శ్రీ పద షా వారు ఈ ప్రాంతానికి సమీపం లో ఒక టచ్ స్టోన్ ని కనుగొన్నారని అందుచేతే అత్యంత తక్కువ సమయం లో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయ్యగలిగారని స్థానికుల నమ్మకం. నిలుచుని ఆకాశం వైపు చూస్తున్న్నట్టుగా దర్శనమిచ్చే లార్డ్ శాంతినాథ్ ఈ ఆలయం లో ని ప్రధాన దైవం. ఈ విగ్రహం ఎరుపు రంగులో ఉంటుంది. 18 అడుగుల ఎత్తులో ఉంటుంది.
అరహ్నాథ్ స్వామి మరియు కున్తునాథ్ లు ఈ ఆలయం లో ఉన్న ఇతర దైవాలు. అరహనాథ్ స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తు ఉండగా కున్తునాథ్ స్వామి వారి విగ్రహం 10 అడుగుల ఎత్తు లో ఉంటుంది. ఈ ఆలయం లో పొందు పరచబడిన మిగతా దేవతల విగ్రహాలు ఈ ఆలయ సొందర్యాన్ని రెట్టింపు చేస్తాయి.