పేరులో సూచించినట్లుగా అక్బర్ యొక్క పట్టాభిషేకం జరిగిన ప్రదేశము. తన తండ్రి మరణము తర్వాత అక్బర్ పట్టాభిషేక వేడుక ఇక్కడే జరిగింది. ఈ వేడుక అక్బర్ 13 సంవత్సరాల వయసులో1556 వ సంవత్సరం ఫిబ్రవరి14 న జరిగింది. తన తండ్రి మరణించిన సమయంలో అక్బర్ బైరం ఖాన్ (తన అధ్యాపకుడు) తో కలిసి ఉండెను. వారు ప్రధాన నగరం నుండి 25 km దూరంలో ఉన్న గురుదాస్పూర్ జిల్లాలో కలనూర్ వద్ద బస చేశారు. ఇప్పుడు ఈ ప్రదేశం భారతదేశం యొక్క పురాతత్వ సర్వే ద్వారా రక్షించబడుతుంది.