సంతోషం కలిగించేలా అన్ని పక్షులు కనపడే ఈ సుల్తాన్పూర్ బర్డ్ అభయారణ్యం హర్యానా జిల్లా, గుర్గాన్ లో ఉన్నది. ప్రభుత్వం 1972 లో దీనిని పక్షి అభయారణ్యం గా ప్రకటించింది, ఈ సుల్తాన్పూర్ బర్డ్ అభయారణ్యంలో స్థానిక మరియు వలస పక్షులు అయిన 250 జాతుల పక్షులకు ఒక రక్షిత ప్రాంతంగా ఉన్నది.
ఈ సుల్తాన్పూర్ బర్డ్ అభయారణ్యం సందర్శించటానికి శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో పెద్ద సంఖ్యలో సైబీరియా, యూరోప్ మరియు ఆఫ్గనిస్తాన్ దేశాలనుండి పక్షులు వలస వొస్తాయి. ఇక్కడ పక్షులే కాకుండా, పర్యాటకులను అలరించే ఒక ప్రముఖ పిక్నిక్ స్పాట్, లైబ్రరీ, వాచ్ టవర్లు, ఒక పిల్లల పార్కు, ఒక విద్య సెంటర్ కూడా ఉన్నాయి.
సుల్తాన్పూర్ అభయారణ్యంలో సాధారణ కూకుడుగువ్వ, ప్యాడీయిల్డ్ జిట్టంగి, ఊదా రంగు సూర్యపక్షి, భారత రోలర్ తెల్ల కంకణాలు, సాధారణ తెడ్డుమూతికొం, లాఫింగ్ గువ్వ మరియు అనేక రకాల నివాస పక్షులు కనిపిస్తాయి. సైబీరియన్ క్రేన్, అతిపెద్ద రాజహంస, అడవి ఉల్లంకి, భారత స్వర్ణ గిజిగాడి, దువ్వు బాతు, పసుపు రంగు వాగ్టైల్ మరియు అనేక రకాల వలస పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి.