ఏనుగుల శిబిరం గురువాయురప్పన్ దేవాలయంకి సుమారు ౩ కి.మీ. దూరంలో పున్నతుర్ కొట్టలో కలదు. ఈ ఏనుగుల శిబిరం ఇండియాలోనే అతి పెద్దది. ఇది పున్నత్తూరు రాజులకు చెందినది. ఈ శిబిరం సుమారు పది ఎకరాలలో వుంది సుమారు 60 ఏనుగులకు ఆశ్రయం ఇస్తోంది. ఈ శిబిరం లోని ఏనుగులు గురువాయురప్పన్ దేవాలయంకు భక్తులచే ఇవ్వబడ్డాయి .ప్రసిద్ధిచెందిన గురువాయుర్ పద్మనాభన్ మరియు గురువాయుర్ కేసవన్ లు ఈ శిబిరానికి చెందినవే. ఇవి అధిక సంఖ్యలో జనాలను ఆకర్షిస్తాయి. దేవాలయ పండుగలలో మరియు ఊరేగింపులలో దేవతలను మోస్తాయి. అంతేకాకఈ ఏనుగులు దేవాలయం నిర్వహించే పందేలలో పాల్గొంటాయి. రేసులో గెలిచిన ఏనుగును గురువాయురప్పన్ విగ్రహాన్ని మోయటానికి వినియోగిస్తారు.