పాలయూర్ చర్చి ఆకర్షణీయంగా వుంటుంది. దీనిని క్రీస్తు బోధకుడు అయిన సెయింట్ థామస్ స్థాపించారు. చర్చి శిల్ప శైలి అపురూపంగా వుంటుంది. దీనికి సుమారు పద్నాలుగు గ్రానైట్ విగ్రహాలు కలిగి, సెయింట్ తమస్ జీవితాన్ని వివిధ దశలలో చూపుతుంది. ఈ విగ్రహాలను చర్చి ప్రవేశంలోనే చూడవచ్చు. పాలయూర్ మహాతీర్ధ పండుగ వేడుకలలో దేశంలోని వివిధ భాగాలనుండి చెక్క శిలువలు మోసుకుంటూ క్రీస్తు భక్తులు ఇక్కడకు వస్తారు. కొత్తగా జన్మించిన బిడ్డలను బాప్తిసం చేసేందుకు ఇక్కడకు తీసుకు వస్తారు.