బుద్ధుడికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. శుక్లేశ్వర్ కొండపై బ్రహ్మపుత్ర నది యొక్క శుక్లేశ్వర్ ఘాట్ వద్ద ఈ ఆలయం ఉంది. హిందూ మరియు బౌద్ధ నిర్మాణ శైలి ని ప్రతిబింబించే ఈ కట్టడం అద్భుతమైనది. 17 వ శతాబ్దం లో ఈ ఆలయం పునర్నిర్మితమయిందని తెలుస్తోంది.
ఈ ఆలయ ప్రాంతం ఎంతో అందమైనది. ఈ చిన్న కొండపై నుండి బ్రహ్మపుత్రా నది యొక్క అందాలు కనువిందు చేస్తాయి. ఈ జనార్ధన ఆలయం లో ని ప్రశాంతమైన వాతావరణం భక్తులని అలాగే పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది.
గువహతి సిటీ సెంటర్ అయిన పల్తాన్ బజార్ నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు అలాగే అద్దె టాక్సీల ద్వారా పర్యాటకులు ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. తెల్లవారు జామున అలాగే సాయంత్రాలు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. సూర్యోదయం ఇంకా సూర్యాస్తమయం ఈ ప్రాంతం నుండి వీక్షించడం మరపురాని అనుభూతిని కలిగిస్తాయి.