నవగ్రహ అంటే తొమ్మిది గ్రహాలు అని అర్ధం. చిత్రాసల్ కొండలపై ఈ ఆలయం ఉంది. తొమ్మిది గ్రహాలకి ప్రతిరూపంగా ఈ ఆలయం లో తొమ్మిది శివ లింగాలు ఉన్నాయి. ప్రతి శివలింగం ఒక్కో రకమైన రంగు బట్టతో అలంకరింపబడుతుంది.
అహోం రాజు రాజేశ్వర సింఘా సమయం లో లేదా అతని కుమారుడు రుద్రా సింఘా (సుఖ్రుంగ్ ఫా) సమయం లో ఈ ఆలయం 18 శతాబ్ద కాలం లో నిర్మితమయి ఉండవచ్చని భావిస్తారు. 1897 లో సంభవించిన అతి పెద్ద భూకంపం వాళ్ళ ఈ ఆలయం చాలా మటుకు ధ్వంసం అయింది. ఆ తరువాత ఇనుప పలుకలతో ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. గువహతి పురాతన పేరు అయిన ప్రగ్జ్యోతిషపుర అనే పేరు ఈ ఆలయ ఖగోళ మరియు జ్యోతిష శాస్త్ర కేంద్రం నుండి తీసుకోబడినది.
ఈ ఆలయం నగరం లో ని ఇతర ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంటుంది. ఈ ఆలయం యొక్క మరొక ఆకర్షణ శిల్పు ఖురి అనబడే ట్యాంక్. ఇది ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది.