గువహతి లో ఉన్న రీజినల్ సైన్స్ సెంటర్ మ్యూజియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ కౌన్సిల్ అఫ్ సైన్స్ మ్యూజియమ్స్ చే నిర్వహింపబడుతున్న 27 మ్యూజియం ల లో ఒకటి. పిల్లలతో ప్రయాణిస్తున్నట్టయితే ఈ మ్యూజియం ని తప్పక సందర్శించి తీరాలి. విద్యార్ధులకి అలాగే సైన్స్ అభిలాష కలిగిన వాళ్ళకి ఈ ప్రదేశం అత్యంత అముల్యమైనది. ఇక్కడ అనేకమైన ప్రదర్శనలు, విజ్ఞాన ప్రదర్శనలు ఇంకా క్యాంపులతో పాటు సెమినార్లు కూడా గమనించవచ్చు.
ఈ సెంటర్ గువహతి శివార్ల లో ని ఖానాపర లో జవహర్నగర్ లో ఉంది. వివిధ రకాల రవాణా సదుపాయాల ద్వారా ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. 1994 లో ప్రారంభమయిన ఈ సెంటర్ పర్యాటక ఆకర్షణ గా క్రమంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఎన్నో అరుదైన వాయిద్యాలు, యంత్రాలు ఇంకా విజ్ఞాన శాస్త్రాన్ని చాలా చక్కగా వివరించే పత్రాలు ఉన్నాయి. ప్రీ హిస్టారిక్ పార్క్, 3డి సైన్స్ మూవీస్, మిర్రర్ మేజిక్, సైన్స్ షౌస్, బట్టర్ ఫ్లై కార్నెర్, డిజిటల్ ప్లానెటోరియం మరియు ఎన్నో అక్వరియం లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.