పవిత్ర మైన బ్రహ్మపుత్ర నదిపైన పీకాక్ ద్వీపం పై ఉన్న ఉమానంద ఆలయం అద్భుతమైన నిర్మాణ శైలితో గువహతి నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మహా శివుడికి అంకితమివ్వబడిన ఈ ఆలయం ఘోం రాజు గడధర్ సింఘాల పాలనలో బార్ ఫూకాన్ గర్హ్గన్య హన్డిక్ చేత నిర్మితమయ్యింది.
ఫిబ్రవరి లోని శివరాత్రి పర్వ దినాన ఎంతో మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఉన్న బ్రహ్మపుత్ర నది వల్ల ఈ ఆలయం అందం రెట్టింపు అయింది. సూర్యాస్తమయము లో ఈ ఆలయాన్ని సందర్శించడం ఎంతో బాగుంటుంది.
ఈ ఆలయం యొక్క ఆకర్షణీయమైన అంశం ఇక్కడి గోడలపై ఉన్న కట్టడాలు. సూర్య, శివ, గణేశా మరియు దేవి చెక్కడాలు ఇక్కడి ఆలయ గోడలపై గమనించవచ్చు. పడవలు మరియు మోటార్ లాంచ్ ల ద్వారానే ఈ ఆలయానికి చేరుకోవచ్చు.