ఇండియా లోనే అతి పెద్ద చారిత్రక స్మారకం అయిన గ్వాలియర్ ఫోర్ట్ నగరం మధ్య లో ఒక కొండపై వుంది. పూర్తి నగరాన్ని పై నుండి చక్కగా చూపుతుంది. దీని మార్గంలో రాళ్ళ తో చెక్కబడిన జైన తీర్థంకరుల విగ్రహాలుంటాయి. ప్రస్తుత ఈ గ్వాలియర్ కోటను తోమార్ వంశానికి చెందినా రాజా మాన్ సింగ్ తోమార్ నిర్మించాడు. కోట నిర్మాణంలో చైనీయుల శిల్ప తీరు కనపడుతుంది. కోట స్తంభాలపై కల డ్రాగన్లు ఆనాటి చైనా...భారత సంబంధాలను సూచిస్తాయి. గ్వాలియర్ కోటను 'జిబ్రాల్టార్ అఫ్ ఇండియా' అని కూడా అంటారు. ఈ కోట వందల ఏళ్ల పాటు అనేక రాజ వంశాలను చూసింది. ఈ కోట వద్దే రాణి ఝాన్సి, తాంతియా తోపే లు బ్రిటిష్ వారితో భయంకర యుద్ధాలు చేసారు.