రాంచౌర మందిర్, హాజీపూర్ పర్యటనలో ఆనవాలు గమ్యస్థానం. శ్రీరాముడు జనక్పూర్ కి వెళ్ళేటపుడు హాజీపూర్ ని సందర్శించడం వల్ల ఈ ఆలయం రామునికి అంకితం చేయబడింది. నేలపై పాదముద్రలు కనిపించిన ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. హాజీపూర్ లోనే శ్రీరాముని పుట్టు వెంట్రుకలు తీసారని పురాణాల కధనం. ఉత్సవాలతో నిండి ఉండే శ్రీరామనవమి పండుగ సమయంలో ఈ ప్రాంతం భారీగా వేడుకలను నిర్వహిస్తుంది. ఈ పవిత్ర ప్రదేశంలో పురాతన కాలంలో ప్రార్ధనలు చేయడానికి అనేక సాధువులు సందర్శించే “బరి సంగత”, చోటి సంగత” కూడా ఉన్నాయి.