హంపి ప్రాంతం అనేక సాగునీటి కాల్వలను భవనాలు, దేవాలయాలు, కొలనులు మరియు వ్యవసాయ భూములకు కలుపబడి ఉంది. వాటిలో చాలావరకు విజయనగర కాలంలో కట్టబడినవే. రాయ కెనాల్, తర్తు కెనాల్, కమలాపుర వాటర్ ట్యాంక్ మరియు బసవన్న కెనాల్ వంటివి విజయనగర రాజులు నిర్మించారు.
ఇప్పటికి వ్యాలీ ప్రాంతంలోని కొన్ని కాల్వలను వ్యవసాయ పనులకు ఉపయోగిస్తున్నారు. వీటిని చూడగోరే పర్యాటకులు తప్పక ఈ పురాతన ప్రాంతాలను సందర్శించాలి. జానపదుల మేరకు శ్రీరాముడు తన తండ్రి అంత్య క్రియలు తుర్తు కెనాల్ ఒడ్డున చేశాడని చెపుతారు.
ఈ కెనాల్ లక్ష్మీ నరసింహ విగ్రహం సమీపంలో కలదు. కమలాపుర నుండి హంపి వచ్చేటపుడు చూడవచ్చు. అనేక రాతి అక్విడెక్టులు కూడా రాజ భవనంలో కనపడతాయి. రాతి తొట్టెలు సుమారు 20 కొలనులకు, బావులకు కలిపారు. కొన్ని రూపాంతరం చెందినప్పటికి ఆ కాలంనాటి నీటి సరఫరా విధానాన్ని మనం ప్రశంసించవచ్చు. హంపిలో అతి పెద్ద అక్విడక్ట్ విరూపాపూర్ గద్దె వద్ద కలదు.