చండి దేవి టెంపుల్ హరిద్వార్ లోని నీల్ పర్వత పై కలదు. ఇది దేశం లోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ టెంపుల్ దేశం లోని 52 శక్తి పీఠాల లో ఒకటి. దీనిని 1929 లో గతం లోని కాశ్మీర్ పాలకుడు నిర్మించాడు. అయితే ఈ టెంపుల్ లోని దేవతా విగ్రహాన్ని సుమారు 8 వ శతాబ్దం లో జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్టించారు.
జానపద గాధల మేరకు చండిక దేవి శుమ్భ మరియు నిశుమ్భ అనే రాక్షసులను వధించిన తర్వాత ఈ ప్రదేశం లో కొద్ది కాలం విస్రమించిందని కూడా చెపుతారు.
ఈ టెంపుల్ చేరాలంటే, హరిద్వార్ పట్టణం నుండి ఆటో లు, రిక్షాలు, తోన్గాలు లలో చేరవచ్చు. చండి ఘాట్ నుండి 3 కి. మీ. ల దూరం లో కల ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ మార్గం లో కూడా చేరవచ్చు. లేదా మరో మార్గం లో కేబల్ కార్ పై కూడా సుమారు 25 నిమిషాల లో చేరవచ్చు.