ఉత్తరాఖండ్ రాష్ట్రం లో, సముద్ర మట్టానికి 2620 అడుగుల ఎగువన, భగీరథి నది ఒడ్డున, ఉత్తర కాశీ కి 72 కి.మీ దూరం లో గల గ్రామం హర్శిల్. ఈ పేరు గురించి చిన్న పౌరాణిక కథ చెబుతారు. సత్య యుగం లో నదీ దేవతలైన భగీరథి, జలంధరి లు తమ ఇద్దరి లో ఎవరు ప్రాముఖ్యమైనవారు అనే విషయం మీద వాదులాడుకుంటూంటే, అది చూసిన విష్ణువు ( విష్ణువు కే మరో పేరు "హరి") ఒక శిల గా మారిపోయి, వారి ఆగ్రహాన్నంతటినీ ఆ శిల లోకి తీసుకున్నాడట. అందువల్లే ఈ గ్రామానికి "హరిశిల" లేక "హర్శిల్" అనే పేరు వచ్చిందట.
చార్ ధాం అనబడే నాలుగు ప్రముఖ హిందూ యాత్రాకేంద్రాల్లో ఒకటైన గంగోత్రి కి ఈ గ్రామం సమీపం లో ఉంది. దీనికి 30 కి.మీ దూరం లో ఉన్న గంగోత్రి జాతీయ పార్క్ ఇక్కడి మరొక ముఖ్య పర్యాటక కేంద్రం. ఇదే కాకుండా ముఖ్బా గ్రామం, అలాగే 1973 లో ఏర్పాటు చేయబడ్డ రక్షణ శాఖ వ్యవసాయ పరిశోధన కేంద్రం, పర్యాటకులని బాగా ఆకర్శిస్తాయి.
హర్శిల్ చిన్న గ్రామం కావడం వల్ల ఇక్కడ ఎయిర్ పోర్ట్ గానీ, రైల్వే స్టేషన్ గానీ లేవు. డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్, రిషికేష్ లోని రైల్వే స్టేషన్ హర్శిల్ కు దగ్గర గా ఉంటాయి. ఈ పవిత్ర ప్రాంతాన్ని పర్యాటకులు ఏప్రిల్- జూన్ మధ్య గానీ సెప్టెంబర్ మధ్య గానీ సందర్శిస్తూ ఉంటారు.