జైన మతస్తులు హస్తినాపూర్ ను ఒక తీర్థ క్షేత్రంగా భావిస్తారు. దిగంబర్ జైన్ బడా టెంపుల్ సిటీ లో పురాతన గుడి. పేరుకి తగినట్లు ఇది ఒక పెద్ద టెంపుల్. ఇది ఒక 40 అడుగుల ఎత్తున కొండపై కలదు. ఈ టెంపుల్ నిర్మాణం తెల్లని తెలుపు రాతి తో చేయబడి భగవాన్ శాంతినాథ్ విగ్రహం పద్మాసనం లో కూర్చుని ప్రధాన దేవుడుగా వుంటుంది. టెంపుల్ లోపలి అలంకరణలు ఆకర్షణీయంగా వుంటాయి. ఈ అలంకరణలకు సుమారు 7 – నుండి 8 కిలోల బంగారం ఖర్చు చేసినట్లు చెపుతారు. ఈ టెంపుల్ లో ఒక లైబ్రరీ, వృద్ధాశ్రమం, జల మందిర్, మ్యూజియం మరియు కైలాష పర్వతం కలవు. యాత్రికులకు వసతి, భోజనం కూడా లభిస్తుంది.