ఈ మందిరం సాధ్వి పరం పూజ్య శిరోమణి శ్రీ జ్ఞాన మతి మాతాజీ పేరు తో నిర్మిఇంచారు. 1965 లో వింధ్య పర్వతాలలో భగవాన్ బాహుబలి విగ్రహం వద్ద ఆమె ధ్యానిన్చునపుడు ఆమెకు ఈ ద్వీపం ఏర్పాటు అవగతమైనది. ఆమె తన ధ్యానంలో ఒక గొప్ప మధ్య లోక విశ్వాన్ని, పదమూడు ద్వీపాలను చూసింది.
ఆమె దర్శించిన అంశాలు సుమారు రెండు వేల సంవత్సరాల కిందట కొన్ని గ్రంధాలలో వ్రాసి కలవు. హస్తినాపూర్ యువ రాజు అయిన రిషభ దేవ్ కూడా తన కలలో సుమేరు పర్వతాన్ని దర్శించాడు. తన ధ్యానంలో కనిపించిన నిర్మాణం చేసేటందుకు గాను సాధ్వి దేశమంతా పాద యాత్ర చేసారు. చివరకు ఆమె హస్తినాపూర్ చేరుకొని ఈ పవిత్ర ప్రదేశం లో తన కలను వాస్తవం చెసుకొన్నారు.
ఈ టెంపుల్ కు 1974 లో పునాది పడగా 1985 లో నిర్మాణం పూర్తి అయింది. టెంపుల్ నిర్మాణం అంతా జైన గ్రందాల లోని విశ్వం రూపంలో వుంటుంది. సుమేరు పర్వతం దాని చుట్టూ జంబూ ద్వీపం ఏర్పడి వుంటాయి.