హేవ్ లాక్ ఐల్యాండ్ భూమిపై స్వర్గంలా ఉంటుంది. ఈ ప్రదేశానికి బ్రిటిష్ పాలనలోని ఒక జనరల్ అయిన హెన్రీ హేవ్ లాక్ పేరు పెట్టారు. పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ద్వీపాన్ని సందర్శిస్తారు. ఈ ప్రదేశంలో అయిదు ప్రధాన గ్రామాలు వాటి పేర్లతో బీచ్ లు కలవు. ఆ గ్రామాల పేర్లు వరుసగా, గోవంద నగర్, రాధా నగర్, బిజయ్ నగర్, శ్యామ్ నగర్, క్రిష్ణనగర్, రాధా నగర్. వీటినే బీచ్ లు గా కూడా చెపుతారు. ఈ బీచ్ లను ఆసియా ఖండంలోనే అత్యుత్తమ బీచ్ లుగా టైమ్ మేగజైన్ 2004 లో ప్రకటించింది.
హేవ్ లాక్ ఐలండ్ సుమారుగా పోర్ట్ బ్లెయిర్ కు ఈశాన్యంగా 55 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజూ పోర్ట్ బ్లెయిర్ నుండి రెండు మూడు పార్లు ఫెర్రీలు నడుస్తాయి. ఫెర్రీ టికెట్లు 5 నుండి 8 అమెరికా డాలర్లుగా ఉంటాయి. కేటమరాన్ ఫెర్రీలు కొద్దిగా అధిక ధర. త్వరగా చేరుకోవాలంటే పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్ లాక్ కు హెలికాప్టర్లు కూడా కలవు.
ఒకసారి మీరు హేవ్ లాక్ దీవి చేరితే ఆ దీవిలో బీచ్ లు, ష్యాక్ లు, షాపింగ్ ప్రదేశాలు చూస్తూ నడక చేయటం మంచిది. రాధా నగర్ బీచ్ లో అందమైన తెల్లని ఇసుక తిన్నెలుంటాయి. వివిధ రుచులు కల సీ ఫుడ్లు కూడా ఆరగించవచ్చు. బీచ్ పక్క మధ్యాహ్నాలు చల్లని గాలులు ఆస్వాదించవచ్చు. రాధానగర్ బీచ్ నుండి పర్యాటకులు అక్కడే కల మరింత ఆకర్షణీయ బీచ్ ఎలిఫెంట్ బీచ్ నడకలో చేరవచ్చు. నడవలేని వారికి ఆటో రిక్షాలు రెండు డాలర్లు లేదా రూ.100 ధరపై చేరుకోవచ్చు. రిక్షాలే కాక, క్యాబ్ లు లేదా రెండు చక్రాల బైక్ లు రోజు అద్దెలకు దొరుకుతాయి. వీటి అద్దే 4 డాలర్లు లేదా రూ. 200 గా ఉంటుంది.
హేవ్ లాక్ ఐలాండ్ లో స్కూబా డైవింగ్ మంచి ఆనందం కలిగిస్తుంది. అండమాన్ దీవులలో స్పీడ్ బోట్లు లేవు. పోర్ట్ బ్లెయిర్ లో ఒక రీ కంప్రెషన్ ఛాంబర్ కలదు. స్కూబా చేసేవారు కొత్త వారైనా, అనుభవం కలవారైనా సరే హేవ్ లాక్ ఐలండ్ లో చేయవచ్చు. ధర సమంజసమే. ఇక్కడ కల వివిధ జాతుల మొక్కలు, జంతువులను వ్యక్తిగతంగా పరిశీలిస్తూ ఆనందించవచ్చు.
హేవ్ లాక్ ఐలాండ్ లో స్కూబానే కాక, ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. అనేకమంది ట్రెక్కింగ్ గైడ్స్ కూడా లభ్యంగా ఉంటారు.
అండమాన్ నికోబార్ లోని ఇతర ద్వీపాలవలే కాక, హేవ్ లాక్ దీవిలో అనేక హోటళ్ళు, బస వసతులు కూడా కలవు. వీటి రేట్లు అందరికి అందుబాటులో వాటి వాటి నాణ్యతను బట్టి ఉంటాయి. కేఫే డెల్ మార్ మరియు వైల్డ్ ఆర్చిడ్ హోటళ్ళు బాగుంటాయి.
బీచ్ షికార్లు, ఇసుక తిన్నెలు చాలనుకునేవారు అక్కడే కల విలేజ్ నెంబర్ 3 చేరితే చాలు, అనేక రకాల వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. స్ధానికంగా తయారైన అనేక వస్తువులు అందమైనవి దొరుకుతాయి.
ఈ ప్రదేశంలో అసలు సిసలైన సహజ పానీయం కొబ్బరి బొండాల నీరు తాగటం మరచిపోకండి. పానీయ ప్రియులకు డ్రింక్ లు, బీరు కూడా అనేక రెస్టరెంట్లలో లభిస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతం అవడం వలన ధరలు కూడా సమంజసమే.