జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ హేమిస్. ఇది లెహ్ నుండి 40 కిలోమీటర్ల దూరం లో ఉంది. ప్రకృతి ఒడిలో కొద్దిసేపు గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం ఏంతో అనువైనది. హేమిస్ ఆశ్రమం లేదా గొంప గా పర్యాటకులలో ప్రాచుర్యం చెందింది. 1630 లో సత్సంగ్ రస్ప నవంగ్ గ్యాట్సో మొదటి అవతరముచే ఈ ఆశ్రమం నిర్మించబడింది. 1672 వ సంవత్సరంలో మహాయోగ తంత్ర పాఠశాల ఆధ్యాత్మిక బోధనలు ప్రచారం చేసేందుకు రాజా సెంగె నంపర్ గారిచే పునఃస్థాపించబడినది.
ఈ హేమిస్ ఆశ్రమంలో ఉన్న ప్రధాన ఆకర్షణ బుద్ధుని తామ్ర విగ్రహం. 'కాలచక్ర', 'లార్డ్స్ అఫ్ ఫోర్ క్వార్టర్స్; కి సంబంధించిన అందమైన చిత్రలేఖనాలు ఈ ఆశ్రమ గోడలపై గమనించవచ్చు. సింహఘర్జన గురువు గా పేరొందిన టిబెటన్ బుద్ధిసం చరిత్రలో ప్రముఖ వ్యక్తి అయిన గురు పద్మసంభవ గౌరవార్ధం వేల మంది ప్రజలు జూన్/జూలై ల లో హేమిస్ లో వార్షిక ఉత్సవం నిర్వహిస్తారు.
ఇండస్ నదీ తీరంలో ఉన్న హేమిస్ నేషనల్ పార్క్ ని మరొక ప్రసిద్దమైన ప్రధాన పర్యాటక ఆకర్షణ గా పేర్కొనవచ్చు. ఈ ప్రాంతం హేమిస్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ గా ప్రసిద్ది. అంతే కాదు, భారత దేశంలో రెండవ అతి పెద్ద సంరక్షణ ప్రాంతంగా దీనిని ప్రకటించారు. 4400 చదరపు అడుగులు కలిగిన ఈ నేషనల్ పార్క్ దక్షిణ ఆసియా లో నే అతిపెద్ద నేషనల్ పార్క్. స్నో లెపర్డ్, డీర్, మకాక్స్, రెడ్ ఫొక్షెస్, వొల్వ్స్, లమెర్జియెర్ రాబందు, గోల్డెన్ ఈగల్ వంటివి ఇక్కడ కనిపిస్తాయి.
ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకునే పర్యాటకులు రైలుమార్గం లేదా రోడ్డుమార్గాన్ని ఎంచుకోవచ్చు. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే ఎండాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం. హేమిస్ లో శీతాకాలం అధికమైన చలి కలిగి ఉంటుంది. మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పడిపోతుంది.