గురుద్వారా హేమకుండ్ సాహిబ్, ఇది ప్రఖ్యాతి గాంచిన సిక్కులయొక్క పవిత్ర ప్రార్థనా స్థలం మరియు ఇది హేమకుండ్ సరస్సు ఒడ్డున ఉన్నది. ఇక్కడ సిక్కుల 10వ గురువు అయిన గురు గోవింద్ సింగ్ చాలా సంవత్సరాలు ధ్యానంలో గడిపారు. ఈ ప్రార్థనా మందిరంలోకి వెళ్లబోయే ముందు, సిక్కులు ఇక్కడికి సమీపంలో ఉన్న సరస్సులో మునిగి వెళతారు. ఇక్కడ సరస్సు నీరు చాలా చల్లగా ఉంటుంది మరియు పురుషులు మరియు మహిళల కొరకు ప్రత్యేకమైన స్నానపుగదులు ఉన్నాయి. ఇక్కడ వీరు పవిత్ర స్నానం ఆచరిస్తారు. భక్తులు సమీపంలోని దుకాణాల నుంచి చిన్నచిన్న స్మృతి చిహ్నాలను కొనుగోలు చేస్తుంటారు.
గురుద్వారా లోపల భక్తులకు, పంచదార, గోధుమపిండి, నెయ్యి సమభాగాలతో తయారు చేసిన కారా ప్రసాదంతో పాటు ఖిచ్రి మరియు టీ కూడా ఇస్తారు. కారా ప్రసాదం ప్రార్థన తరువాత భక్తులకు ఇవ్వబడుతుంది. ప్రార్థనా సమయంలో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ యొక్క పేజీ యొక్క ఎడమ వైపు నుండి 'హుకంనామా' చదువుతారు. మేజర్ జనరల్ హర్కిరత్ సింగ్, భారత సైన్యం యొక్క చీఫ్ ఇంజనీర్ 1960 లో సందర్శించినప్పుడు దీనిని కట్టారు. తరువాత 'ఆర్కిటెక్ట్ సియలి' గురుద్వారా నిర్మాణ పనులను చూసింది.