హేమకుండ్ సరస్సు ఒక పవిత్రమైన సరస్సుగా భావిస్తారు, ఇది సంవత్సరంలో 8నెలలు గడ్డ కట్టుకొని ఉంటుంది. ఇది హేమకుండ్ గురుద్వారా సమీపంలో ఉన్నది, దీనికి అన్ని వైపులా మంచుతో కప్పబడిన పర్వతాలతో చుట్టుముట్టి ఉన్నది. జానపద కథనం ప్రకారం, ఈ సరస్సు ఒడ్డున 10వ సిక్కు గురువు అయిన గురు గోవింద్ సింగ్ ధ్యానంలో ఉన్నారని తెలుస్తున్నది. ఈ పవిత్రమైన స్థలంలో అనేకమంది మతగురువులు, 'మేధస' అనే మతగురువుతో సహా ధ్యానముద్రలో మునిగారని చెపుతారు.