సుబ్రహ్మణ్య శివ, ధైర్యవంతుడైన యువ దేశభక్తుడు, ఇది అతని జ్ఞాపకార్ధం నిర్మించిన స్మారక చిహ్నం. ఇతను మదురై దగ్గర ఉన్న వాతాలగుండు అనే చిన్న పట్టణంలో 1884 లో జన్మించాడు మరియు తమిళనాడు యొక్క ప్రఖ్యాత విప్లవకారులలో ఒకరు. అతను, V.O చిదంబరం పిళ్ళై కలిసి పనిచేశారు మరియు స్వాతంత్ర్య సమరంలో చేరిన అనేక యువకులకు ఒక ప్రేరణ మరియు ప్రభావాన్ని చూపారు. మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క మొదటి రాజకీయ ఖైదీ, ఇతర పద్ధతులు విఫలమైనప్పుడు హింసకు హింసయే సరిఅయిన ప్రతిచర్య అని అతని నమ్మకం. అతను ఒక కవి మరియు పండితుడు మరియు అతని పద్యాలు 'ఘన భాను' పేరున ప్రచురితమయ్యాయి. 1925 జూలై లో అతను మరణించిన తరువాత, పెన్నగ్రం తాలుకాలో అతని సమాధిలాగా ఈ స్మారక చిహ్నాన్ని కట్టారు.