ఈ ప్రాంతంలో దేవీమాత చౌడేశ్వరి ఆలయం ఉంటుంది. ఈ దేవాలయం పర్యాటకులకు ఒక పెద్ద ఆకర్షణ. ఈ పట్టణంలో వాణిజ్యపర కార్యకలాపాలు లేకపోవటం వలన ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సమీప గ్రామస్తులు ఈ మాత చౌడేశ్వరి తమను బందిపోట్లనుండి, దొంగలనుండి కాపాడుతుందని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చౌడేశ్వరి దేవాలయంలో జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో సింగనదూరు పట్టణానికి వేలాది భక్తులు వస్తారు. ఇక్కడకు వచ్చే వారికి ఎంట్రీ కూపన్లు మొదట వచ్చిన వారికి మొదటగా అనే పద్ధతిపై ఇతస్తారు. ఈ దేవాలయానికి రావాలంటే, షరావతి నది మరియు అడవి రెండూ దాటి రావాలి.