హోసూర్ పట్టణం బెంగళూరు నగారానికి 40 కి.మీ.ల దూరంలో కలదు. తమిళ నాడు లోని క్రిష్ణగిరి జిల్లా పరిధి లోకి వస్తుంది. ఒక బిజి గా వుండే పారిశ్రామిక పట్టణం అయినప్పటికీ అక్కడి ఆహ్లాదకర వాతావరణం మరియు పుష్కలమైన పచ్చదనాలు ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక ప్రదేశంగా కూడా చేసాయి. దీనిని ఇక్కడ కల చల్లటి వాతావరణం కారణంగా లిటిల్ ఇంగ్లాండ్ అని కూడా అంటారు.
ఇది ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రాధాన్యత కలది. హోసూర్ అంటే కన్నడం లో ' కొత్తగా స్థిరపడిన ప్రదేశం ' అని అర్ధం చెపుతారు.
టిప్పు సుల్తాన్ కాలం లో ఈ సిటీ ప్రాధాన్యత కలది. బ్రిటిష్ పాలన లో ఇది టిప్పు సుల్తాన్ మైసూరు రాజ్యానికి బ్రిటిష్ రాజ్ కు ఒక సరిహద్దు గా వుండేది. హోసూర్ ను హోయసల రాజు రామ నాథ క్రి.శ. 1290 లో కనుగొన్నాడు. బ్రిటిష్ ఇండియా కంపెనీ దీనిని రెండు సార్లు అంటే 1768 మరియు 1791 లలో గెలుచుకొంది. ఆ రోజులలో హోసూర్ లో ఒక ప్రధానమైన కోట వుండేది. అందమైన స్కాట్లాండ్ లోని కేనిల్ వర్త్ కేజల్ నమూనా లో వుండేది. ఇపుడు అది శిధిలమైంది. హోసూర్ బ్రిటిష్ రాజ్ లో వున్నపుడు సేలం జిల్లాకు రాజధానిగా వుండేది.
పారిశ్రామిక నగరం గానే కాక హోసూర్ మెల్లగా ప్రపంచ అతి పెద్ద గులాబీ పూవులా ఎగుమతి దారుగా పేరు పొందుతోంది. పూవుల సాగు ఇక్కడ ప్రధానం అవుతోంది. ప్రతి సంవత్సరం కట్ రొసెస్ 8 మిలియన్ ల వరకూ యూరోప్ కు మరియు వివిధ ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. మరో మాటలో చెప్పాలంటే ఈ పట్టణం రూ.150 కోట్ల ఫారిన్ ఎక్స్చేంజి పూవుల వ్యాపారం చేస్తోంది. మధ గొండపల్లి లోని తన్ఫ్లోర ఇన్ఫ్రా స్ట్రక్చర్ పార్క్ కట్ రొసెస్ లో ప్రధాన వ్యాపారి. అత్యధిక డిమాండ్ కల 'తాజ్ మహల్' అనే ఒక గులాబి పూవును ఎగుమతి చేస్తుంది.
పారిశ్రామిక పట్టణం
తమిళ్ నాడు పారిశ్రామిక ప్రమోషన్ కార్పొరేషన్ ప్రోత్సాహంతో హోసూర్ ఒక పారిశ్రామిక నగరం అయ్యింది. వెనుక బడిన విలేజ్ లలో , పట్టణాలలో పరిశ్రమలు అభివృద్ధి అయాయి. అనేక కంపెనీ లు అశోక్ లే ల్యాండ్ లిమిటెడ్, అపోలో ట్యూబ్స్ లిమిటెడ్, , ఆసియ టొబాకో , అవేతెక్ లిమిటెడ్, బేస్ కార్పొరేషన్, బాటా ఇండియా, కార్బోరండం యూనివర్సల్ లిమిటెడ్, ఎక్సైడ్ ఇండస్ట్రీ , టివి ఎస్ మోటార్స్ మొదలైన అనేక ప్రధాన కంపెనీ లు ఇక్కడ తమ పరిశ్రమలను స్థాపించాయి.
గత చరిత్ర వైభవం,మరియు ఆహ్లాదకర వాతావరణం, పోన్నియర్ నదికి పక్కనే వుండటం తో హోసూర్ వ్యాపరపరంగానే కాక పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చెందినది. టూరిస్టులు చిన్నపాటి వారాంతపు విహారాలకు వస్తారు. అందమైన కేలవరపల్లి డాం, స్థానికుల ఆదరణ, రాజాజీ మెమోరియల్ మరియు చంద్ర చూదేస్వరార్ టెంపుల్ వంటి ప్రదేశాలు, చారిత్రక భవనాలు పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఆకర్షణలు మతపర ఆకర్షణల నుండి ఎయిర్ ప్లేన్ ల ఆసక్తి వరకు టూరిస్టులకు హోసూర్ పట్టణం అనేక ప్రాంతాలు చూపుతుంది. స్నేహితులతో, లేదా కుటుంబ సభ్యులతో కలసి కేలవరపల్లి డాం లేదా చంద్ర చూదేస్వరి టెంపుల్ లేదా రాజాజీ మెమోరియల్ వంటివి సందర్శించ వచ్చు. హోసూర్ ప్రధాన ఆకర్షనలలో ఆరుళ్ మిగు మరగాధంబాల్ సమేద కు అంకితం ఇవ్వబడిన హిల్ టెంపుల్ మరియు చంద్రచూదేశ్వరార్ టెంపుల్ ప్రధానం. మరో కొండపై హోసూర్ కు 2 కి.మీ.ల దూరం లో మరొక టెంపుల్ కలదు. ఈ టెంపుల్ లో శ్రీ వెంకటేశ్వర విగ్రహం వుంటుంది. దీనిని అందరూ దక్షిణ తిరుపతి అంటారు. హోసూర్ కు 80 కి. మీ.ల దూరంలో కల హోగినేకల్ వాటర్ ఫాల్స్ తప్పక చూడాలి. మీరు ప్రకృతి ప్రియులైతే, కృష్ణ గిరి వైపు పర్యటీంచండి. ఇక్కడ మీకు అనేక అడవి జంతువులు కనపడతాయి. అనేక జిల్లాలకు విద్యుత్ ను అందించే కృష్ణ గిరి డాం కూడా ఒక ఆకర్షణ. ఇంతేకాక, హోసూర్ చుట్టుపట్ల హిల్ స్టేషన్ లు అంటే 310 కి.మీ.ల దూరంలోకల మడికేరి, సుమారు ఇదే దూరాల లోకల వయనాడ్ 290 కి.మీ., కూర్గ్ 280 కి. మీ. ఊటీ 296 కి. మీ.లు కోడై కెనాల్ 405 కి. మీ. లు కలవు. ప్రసిద్ధ యాత్రా స్థలాలైన పుట్ట పర్తి 190 కి. మీ. , తిరుపతి 240 కి. మీ. కూడా ఇక్కడనుండి వెళ్ళవచ్చు. ఇక్కడకు మహాబలి పురం బీచ్ 305 కి. మీ. లు మరియు పాండిచేరి బీచ్ 270 కి. మీ. కల దూరంలోను వుంటాయి.