కేలవరపల్లి డామును తమిళనాడు లోని పోన్నియర్ నది పై సుమారు 13.5 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ డాం నీరు కడ్లూర్ ,ధర్మపురి,క్రిష్ణగిరి మరియు వెల్లూరు లకు సరఫరా అవుతుంది. ఇది హోసూర్ కు 10 కి.మీ.కల దూరం లో కేలవరపల్లి నుండి బెంగుళూరు వెళ్ళే మార్గం లోకలదు .
హోసూర్ స్థానిక ప్రజలకు, టూరిస్టులకు ఈప్రదేశం వారాంతపు విహారాలకు ఒక మంచి పిక్నిక్ ప్రదేశం. ఈ డాం వద్ద పిల్లల పార్క్ కూడా కలదు. ప్రకృతి ప్రియులకు రణగొణ ధ్వనులు లేని , కాలుష్యం లేని చక్కని ప్రదేశం గాను, పక్షి సందర్సలకు అనేక వలస పక్షులను చూపెదిగాను వుంటుంది. ఇక్కడి రిజర్వాయర్ సమీపం లో కల చిన్న గ్రామం చేనతూర్ లో పక్షుల ధ్వనులు నిరంతరం వినబడుతూనే వుంటాయి.