ఉంకాళ్ లేక్ 110 సంవత్సరాల ప్రాచీన సరస్సు. ఎంతో ప్రశాంతంగా, అందమైన పర్యావరణం కల ఈ సరస్సును పర్యాటకులు తప్పక చూడాలి. ఈ సరస్సు సుమారు 200 ఎకరాలలో విస్తరించి హుబ్లీ ఆకర్షణలలో ప్రధానంగా నిలబడుతోంది. సాయంకాలలో సూర్యాస్తమయం ఇక్కడనుండి చూస్తే ఎంతో బాగుంటుంది.
ఇక్కడ ప్రధాన ఆకర్షణ అంటే స్వామి వివేకానంద. ఈ విగ్రహాన్ని సరస్సు మధ్యలో ఉంచారు. దీనిని 1859లో జన్మించిన శ్రీ సిద్దప్పాజ్జ కర్మ భూమిగా పిలుస్తారు. ఆయన తన ఇంటినుండి 14వ ఏట పారిపోయి తన గురువు వద్ద ఉంకాళ్ మైలారలింగ దేవాలయంలో నివసించాడు. శ్రీ సిద్దప్పాజ్జ 1921 లో మరణించాడు. అప్పటినుండి ఈ ప్రదేశంలో ఒక జాతర చేస్తారు.
సమీప ప్రాంతాలకు ఉంకాళ్ సరస్సు నుండి నీటి సరఫరా జరుగుతుంది. ఈ సరస్సులో బోటింగ్ కూడా చేసి ఆనందించవచ్చు.