హైదరాబాద్ లో ఉన్న బిర్లా ప్లానిటోరియం దేశం లో నే మొట్ట మొదటి ప్లానిటోరియం గా ఖ్యాతి గడించింది. ఇది అప్పటి ముఖ్యమంత్రి అయిన ఎన్ టీ రామారావు చేత 1985 లో ప్రారంభించబడింది. వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించే ఈ గొప్ప ప్రదేశాన్ని పిల్లలతో సందర్శించాలనుకునే వారు మరువకూడదు.
ఈ ప్లానిటోరియం లో విశ్వానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు తెలుసుకోవచ్చు. ఈ అనుభవం అద్వితీయం మరియు అనుపమానం అయినది. ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలు పర్యాటకులకి చక్కటి సంతృప్తి కరమైన అనుభవాన్ని మిగులుస్తాయి. విజ్ఞానంతో పాటు విశ్వ పర్యటన చేసినటువంటి వినోదాన్ని కూడా అందిస్తుంది ఈ ప్లానిటోరియం. బిర్లా ప్లానిటోరియం విజ్ఞానం మరియు వినోదాన్ని అందిస్తుందనడంలో అతిశయం లేదు.