హైదరాబాద్ నగరంలో ఉన్న వనస్థలిపురంలో ఈ మహావీర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్ ఉంది. హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళే దారిలో ఈ నేషనల్ పార్క్ ఉంది. ఈ జింకల పార్క్ లో అనేక రకాలైన జింకలని గమనించవచ్చు. పురాతన కాలంలో నిజాములు వేటాడే ప్రాంతంగా ఈ పార్క్ ని ఉపయోగించుకునే వారు.
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ పార్క్ ని నేషనల్ పార్క్ గా మార్చారు. వేటాడే ఈ ప్రాంతాన్ని వృక్ష మరియు జంతు జాల సంరక్షణకై పార్క్ గా మార్చారు. జింకలతో పాటు ఇక్కడ బ్లాక్ బక్స్ మరియు ముళ్ళపండులని కూడా ఇక్కడ గమనించవచ్చు. తెల్లకొంగలు, కింగ్ఫిషర్లు, నీటి కాకులు, చిన్న తోక గద్దలు, భారత సరస్సు నారాయణ పక్షులు ఇక్కడ కనబడే నిటి పక్షులు.
ఈ పార్క్ కి చాలా సులభంగా చేరుకోవచ్చు. బస్సు ద్వారా లేదా అద్దెకి తీసుకున్న ప్రైవేటు టాక్సీ ల ద్వారా హైదరాబాద్ నుండి ఈ నేషనల్ పార్క్ కి సులభంగా చేరుకోవచ్చు. షటిల్ సర్విసుల ద్వారా ఈ పార్క్ లోపల గైడెడ్ టూర్ అందుబాటులో ఉంది. పార్కు లో కనబడే జంతువుల సంగ్రహావలోకనం కోసం ఒక పెద్ద స్థంబం పర్యాటకుల కోసం నిర్మించబడింది.