పైఘ రాజ వంశీకులకి చెందిన పైగహ్ టొంబ్స్ ని శుమ్స్ ఉల్ ఉమ్రాహి ఫ్యామిలీ. మక్బ్రా శుమ్స్ ఉల్ ఉమ్రా అని కూడా అనబడే ఈ సమాధులు హైదరాబాద్ నగర సివరలలోని పిసాల్ బండ దగ్గర ఉన్నాయి.
1787 లో నవాబ్ తిగ్ జుంగ్ బహదూర్ ఈ టొంబ్స్ ని నిర్మించటం మొదలు పెడితే ఆ తర్వాత అమీర్ ఏ కబీర్, జుంగ్ బహాదుర్ కొడుకు, ఈ నిర్మాణాన్ని కొనసాగించాడు.చాల తరాల పైఘ వారు ఈ టొంబ్స్ లో సమాధి చెయ్యబడ్డారు. ఈ టొంబ్స్ వాటి విశిష్ట నిర్మాణ శైలి వల్ల పేరు గాంచాయి.నిజానికి అటువంటి నిర్మాణ శైలి ప్రపంచంలో మరొకటి లేదని భావిస్తారు.
ఈ టొంబ్స్ స్టక్కో వర్క్ ద్వారా అలంకరించబడి, గ్రీకు , పెర్షియన్ , ముఘల్, రాజస్తాని, అసఫ్ జహి మరియు దక్కని నిర్మాణ శైలిల మేళవింపు తో ఉంటాయి. అప్పటి మహోన్నత కళా నైపుణ్యానికి ఈ టొంబ్స్ ఒక ఉదాహరణ గా నిలుస్తాయి. తర్వాత కాలం లో చలువరాతి తో చెయ్యబడిన తాపడం చూడ చక్కగా ఉంటుంది.