బాగ్ - ఎ- ఆమ్ అంటే ప్రజల యొక్క పార్క్ అని పూర్వం పిలవబడిన పబ్లిక్ గార్డెన్స్ హైదరాబాద్ లో ఉన్న మరోక సుందరమైన ప్రదేశం. 1920 లో నిజాముల చేత ఈ పార్క్ సాధారణ ప్రజల కోసం నిర్మితమైంది. ఇప్పటికి, వందల మంది ప్రజలు ఈ పార్క్ కి విచ్చేస్తారు. హైదరాబాద్ లో ఎన్నో అందమైన ఉద్యానవనాలు ఉన్నప్పటికీ పర్యాటకుల మరియు స్థానికుల మనసు గెలుచుకున్నది పబ్లిక్ గార్డెన్స్ .
ఈ పబ్లిక్ గార్డెన్స్ ప్రాంగణంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ పురావస్తు శాఖ మ్యూజియం కళా ప్రేమికులకి ముఖ్యమైనది. స్టేట్ అర్కలాజికల్ మ్యూజియం, జుబ్లీ హాల్, స్టేట్ లెజిస్లేచర్, తెలుగు లలిత కళా తోరణం మరియు జవహర్ బాల్ భవన్ వంటివి ఈ గార్డెన్స్ లో ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్కలాజికల్ మ్యూజియం కి పక్కగా కంటెంపరరి ఆర్ట్ మ్యూజియం ఉంది.
మ్యూజియం ల ని చూడడం ఇష్టం లేని వారు కూడా పబ్లిక్ గార్డెన్స్ ని సందర్శించవచ్చు. పచ్చటి ప్రకృతి ఒడిలో పచ్చని లాన్ ల లో సేద దీరాలనుకునే వారికి అనువైన ప్రదేశం.