హైదరాబాద్ యొక్క నగర శివార్లలో సాంఘి టెంపుల్ ఉన్నది. ఇక్కడి ఏంతో పవిత్రమైన పొడవాటి రాజ గోపురం ఈ కోవెల యొక్క పేరు ప్రఖ్యాతలను ఇంకా పెంచింది.నిజానికి చాలా దూరం నుంచి ఈ రాజ గోపురాన్ని చూడవచ్చు.పరమానంద గిరి అనే కొండ పైన ఉన్నది అందమైన ఈ ఆలయం.
ప్రతి సంవత్సరం వేలాది మంది భక్త జనం ఇక్కడి భగవంతుని ఆసిస్సుల కోసం వస్తారు.చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడి కొండ అందాలని చూడటానికి వస్తారు. దక్షిణ భారత నిర్మాణ శైలి లో నిర్మించబడినది ఈ ఆలయం. ఈ ఆలయ మెట్ల పైన గొప్ప రాయితో చేయబడిన ఏనుగు విగ్రహం రక్షణ గా ఉంటుంది.ఈ ఆలయానికి ఉన్న మూడు గోపురాలు ఏంతో ఎత్తుగా ఉంది ఆకాశాన్ని తాకుతున్నాయ అనిపిస్తుంది.
వాయు పుత్రుడైన ఆంజనేయుని విగ్రహం ఈ ఆలయ యొక్క చాలా ఎత్తు అయిన ప్రదేశం లో ఉంటుంది.అక్కడి నుండి భక్తులను ఆయన ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం.