హైదరాబాద్ లో లో ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం లో ఈ శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ళ పుర్వానికి చెందినదని నమ్మకం. ప్రతి రోజు వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేస్తారు. ఈ గుడిలో శక్తి కి మరియు అధికారానికి దేవత అయిన మహంకాళి మాత కొలువై ఉంటారు.
ఆదివారం మరియు సోమవారాల్లో పడే ఆషాడ జాతర పండుగ సమయంలో ఈ ఆలయం కిటకిటలాడుతుంది. మహంకాళి మాతని కొలవడానికి ఈ రెండు రోజులు చాలా మంచివి. బోనాలు పండుగని కూడా ఈ ఆలయంలో ఏంతో సంబరంగా , ఆరాధనతో జరుపుకుంటారు. ఈ పండుగని ముఖ్యంగా హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్ నగరాలలో జరుపుకుంటారు.
తెలంగాణా, రాయలసీమ నుండి ఏంతో మంది భక్తులు ఈ పండుగ సమయంలో ఈ ఆలయానికి విచ్చేస్తారు. జూలై ఇంకా ఆగష్టు మాసాలలో ఈ బోనాలు పండుగని జరుపుకుంటారు. ప్రశాంతమైన, నిలకడగా ఉన్న జీవితాన్ని భూమి పైన ప్రసాదించినందుకు కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగ ద్వారా మహంకాళి మాతని ప్రార్ధించేందుకు ఈ పండుగ చేస్తారు.