ఇండోర్ లో ని కొండ పైన ఉన్న బిజసేన్ టేక్రి బిజసేన్ మాత యొక్క అందమైన ఆలయం. దుర్గా అమ్మవారి రహస్య అవతారం గా బిజసేన్ మాత ని భావిస్తారు. ఈ చిన్న ఆలయం 1920 లో నిర్మించబడినది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం నుండి ఈ నగరం యొక్క అద్భుతమైన వీక్షణం మనోహరం గా ఉంటుంది. ప్రతి సంవత్సరం నవరాత్రి పర్వదినం లో ఈ ఆలయం లో వేడుకలు జరుగుతాయి.
ఈ వేడుకలకి ఏంతో మంది భక్తులు తరలి వస్తారు. ఈ కొండపై నుండి సూర్యాస్తమయాన్ని చూడడం అనిర్వచనీయమైన అనుభూతి. ఈ ఆలయం కి సమీపం లో హోల్కర్ లకి సంబంధించిన గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ ప్రస్తుతం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు అర్మ్స్ మ్యూజియం గా రూపాంతరం చెందింది. ఇండోర్ సందర్శనకి వచ్చిన పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా సందర్శిస్తారు. ఈఆలయానికి విమానాశ్రయం నుండి అలాగే రైల్వే స్టేషన్ ల నుండి సులభంగా చేరుకోవచ్చు.